Skip to main content

ఊబకాయం నివారణ

జాతీయ పోషణ మాసం సందర్భం గా
ఊబకాయం నివారణ
– చక్కెర మరియు నూనె వినియోగాన్ని తగ్గించడం ద్వారా కుపోషణను అధిగమించడం 
_ వసుధ. జి, క్లినికల్ న్యూట్రిషనిస్ట్
సర్టిఫైడ్ డయాబెటిస్ ఎడ్యుకేటర్
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
సెప్టెంబర్ నెలను భారతదేశంలో “జాతీయ పోషణ మాసం” (Rashtriya Poshan Maah)గా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. 2025 సంవత్సరానికి తీసుకున్న ప్రత్యేకమైన అంశం — “ఊబకాయం నియంత్రణ: చక్కెర మరియు నూనె వినియోగాన్ని తగ్గించడం”. దీని ప్రధాన లక్ష్యం దేశంలో రెండు వైపుల సమస్యలను ఎదుర్కోవడం పోషణ (Undernutrition) మరియు అతిగా పోషణ (Overnutrition/Obesity).
ఊబకాయం పెరుగుతున్న సమస్య
ఇప్పటి జీవన విధానంలో, రెడీ టు ఈట్ ఫుడ్, ప్రాసెస్‌డ్ పదార్థాలు, తీపి పానీయాలు, అధిక నూనెలతో వండిన పదార్థాలు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. వీటి అధిక వినియోగం వల్ల:ఇవి జరుగుతాయి.
• బరువు పెరుగుదల
• డయాబెటిస్, రక్తపోటు
• గుండె సంబంధిత వ్యాధులు
• చిన్నారులలో ఊబకాయం సమస్యలు పెరుగుతున్నాయి.
చక్కెర తగ్గించుకోవడం వల్ల కలిగే లాభాలు
• తీపి పానీయాలు, బిస్కెట్లు, కేకులు, చాక్లెట్లు తగ్గిస్తే శరీరంలో అవసరంలేని క్యాలరీలు తగ్గుతాయి.
• ఇన్సులిన్ నియంత్రణలో ఉండి మధుమేహం ప్రమాదం తగ్గుతుంది.
• పళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
నూనె తగ్గించుకోవడం వల్ల కలిగే లాభాలు
• వంటలో అధిక నూనె వాడకపోతే కోలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
• గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
• శరీర బరువుపై మంచి నియంత్రణ ఉంటుంది.
(ఒక వ్యక్తికి రోజువారీ నూనె అవసరం సుమారు 20–25 గ్రాముల వరకు మాత్రమే ఉంటుంది.)
కుపోషణ సమస్యను కూడా ఎదుర్కోవాలి
చక్కెర, నూనె తగ్గిస్తే శరీరానికి కావలసిన శక్తి తగ్గిపోతుందా? కాదు. దాని బదులు:
• ధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి.
• పాలు, గుడ్లు, చేపలు, మాంసం (తినే అలవాటు ఉన్నవారు) ద్వారా ప్రోటీన్ పొందాలి.
• మిల్లెట్స్ (జొన్న, రాగి, సజ్జ) వంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా కుపోషణ తగ్గించవచ్చు.
ప్రతి కుటుంబం తీసుకోవాల్సిన చిట్కాలు
1. ఇంట్లో వంటలో తక్కువ నూనె వాడాలి.
2. బాటిల్ జ్యూస్, సోడా పానీయాలు బదులు నీళ్లు, మజ్జిగ, తాజా పండ్ల రసం తాగాలి.
3. పిల్లలకు జంక్ ఫుడ్ బదులు గృహ తయారు చేసిన పోషకాహారం ఇవ్వాలి.
4. రోజూ కనీసం 30 నిమిషాల శారీరక వ్యాయామం చేయాలి.
జాతీయ పోషణ మాసం 2025 మనకు గుర్తు చేస్తోంది — “సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా మాత్రమే కుపోషణ, ఊబకాయం రెండింటినీ తగ్గించవచ్చు”. మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ రోజు నుంచే చక్కెర, నూనె వినియోగాన్ని తగ్గిద్దాం.
_ వసుధ. జి
క్లినికల్ న్యూట్రిషనిస్ట్
సర్టిఫైడ్ డయాబెటిస్ ఎడ్యుకేటర్
సంస్థాపకురాలు – VGNUTRIMENT

Popular posts from this blog

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...