ప్రస్తుతం మార్కెట్లో నిలకడగానే ధరలు ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో అటు రైతులు, ఇటు వ్యాపారులు శీతలగిడ్డంగుల వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే ఖమ్మం నగరంలోని కోల్డ్ స్టోరేజీల వద్ద మిర్చి బస్తాలతో వాహనాలు బారులు తీరుతున్నాయి. ఖమ్మం మార్కెట్ పరిసర ప్రాంతాలతో పాటు నగర శివారులో కలిపి 17 కోల్డ్స్టోరేజీలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఖమ్మం రూరల్ మండలంలో మరో శీతలగిడ్డంగి ప్రారంభమైంది. సీజన్ ఆరంభంలో ఒక్కసారిగా మార్కెట్లో ఎర్రబంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఏకంగా క్వింటాకు రూ.22వేల వరకు గరిష్ట ధర పలికింది. ఎగుమతిదారుల నుంచి భారీగా ఇండెంట్ ఉండటంతో స్థానిక కొనుగోలుదారులు పోటీపడి మిర్చి కొనుగోళ్లు చేపట్టారు. దీంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సరాసరి నలభైవేల బస్తాలు వచ్చాయి. అయితే వారం రోజులు గడవకముందే క్రమక్రమంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో స్థానిక వ్యాపారులతోపాటు, ఇతర రాష్టాల వ్యాపారులు, ఖమ్మం నగరం సమీపంలోని చైనా కంపెనీ ప్రతినిధులు మాత్రమే పంటను కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం జిల్లాలో సుమారు 60 వేల ఎకరాల్లో మిర్చిపంట సాగు జరిగింది. మే నెల వరకు పంట భారీగా వచ్చే అవకాశం ఉందని జిల్లా మార్కెటింగ్శాఖ అధికారులు, ఖమ్మం మార్కెట్ కమిటీ అధికారులు అభిప్రాయపడ్డారు. మార్చిలోనే శీతలగిడ్డంగులకు పంట చేరుకుంటున్నది.
విజ్ఞాన్స్ వర్సిటీ సీఈవోగా డాక్టర్ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా డాక్టర్ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వర్సిటీ వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్ డాక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...