ప్రస్తుతం మార్కెట్లో నిలకడగానే ధరలు ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో అటు రైతులు, ఇటు వ్యాపారులు శీతలగిడ్డంగుల వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే ఖమ్మం నగరంలోని కోల్డ్ స్టోరేజీల వద్ద మిర్చి బస్తాలతో వాహనాలు బారులు తీరుతున్నాయి. ఖమ్మం మార్కెట్ పరిసర ప్రాంతాలతో పాటు నగర శివారులో కలిపి 17 కోల్డ్స్టోరేజీలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఖమ్మం రూరల్ మండలంలో మరో శీతలగిడ్డంగి ప్రారంభమైంది. సీజన్ ఆరంభంలో ఒక్కసారిగా మార్కెట్లో ఎర్రబంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఏకంగా క్వింటాకు రూ.22వేల వరకు గరిష్ట ధర పలికింది. ఎగుమతిదారుల నుంచి భారీగా ఇండెంట్ ఉండటంతో స్థానిక కొనుగోలుదారులు పోటీపడి మిర్చి కొనుగోళ్లు చేపట్టారు. దీంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సరాసరి నలభైవేల బస్తాలు వచ్చాయి. అయితే వారం రోజులు గడవకముందే క్రమక్రమంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో స్థానిక వ్యాపారులతోపాటు, ఇతర రాష్టాల వ్యాపారులు, ఖమ్మం నగరం సమీపంలోని చైనా కంపెనీ ప్రతినిధులు మాత్రమే పంటను కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం జిల్లాలో సుమారు 60 వేల ఎకరాల్లో మిర్చిపంట సాగు జరిగింది. మే నెల వరకు పంట భారీగా వచ్చే అవకాశం ఉందని జిల్లా మార్కెటింగ్శాఖ అధికారులు, ఖమ్మం మార్కెట్ కమిటీ అధికారులు అభిప్రాయపడ్డారు. మార్చిలోనే శీతలగిడ్డంగులకు పంట చేరుకుంటున్నది.
వరద బాధితులకు విజ్ఞాన్స్ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.