Skip to main content

ఆయుష్ ఆధ్వర్యంలో హోమియో మందులు సిద్ధం


  • హోమియో మందులు సిద్ధం.                               - హోంమంత్రి సుచరిత


ఆంధ్రప్రదేశ్ ఆయుష్ డిపార్ట్మెంట్ కరోనా వైరస్ భారీ నుండి బయటపడేందుకు హోమియో మందులను సిద్దం చేసింది. ఆర్సీనిక్ ఆల్బా 30 అనే హోమియో మెడిసిన్ ను ఆయుష్ డిపార్ట్మెంట్ తయారు చేసింది. వీటిని వాడటం వలన కరోనా మహమ్మారి నుండి బయటపడే అవకాశం ఉందని హోమియో డాక్టర్లు చెబుతున్నారు. ఈ మందులను వాడటం వలన మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్ భారిన పడకుండా ఉండొచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది ప్రజలకు ఈ మెడిసిన్ అందేలా చర్యలు చేపట్టారు. ఆయుష్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఉషా కుమారి ఆదేశాల మేరకు ఇప్పటికే రెడ్ జోన్ ప్రాంతాల్లో హోమియో మెడిసిన్ ను పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి 25 వేల 1 డ్రామ్ బాటిల్ లను పంపిణీ చేసేందుకు సన్నద్ధం అయ్యారు. ఒక్కో 1 డ్రామ్ బాటిల్ లో వుండే హోమియో మందును కుటుంబంలోని 6 మంది సభ్యులు వాడవచ్చని వైద్యులు పేర్కొన్నారు. 5 సంవత్సరం లోపు పిల్లలు రోజుకు 3 పిల్స్ చొప్పున 3 రోజుల పాటు వాడాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల పైబడిన వారు రోజుకు 6 పిల్స్ చొప్పున 3 రోజుల పాటు వాడాల్సి ఉంటుంది. ఈ మందులను చేత్తో పెట్టుకోకుండా బాటిల్ మూత సహాయంతో వేసుకోవాలని హోమియో నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి మేకతోటి సుచరిత గారిని కలిసి 25 వేల 1 డ్రామ్ బాటిల్ల ను అందించారు. గుంటూరు జిల్లా నోడల్ ఆఫీసర్ బాబు బాలాజీ ప్రకాశ్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సత్యబాబు, డాక్టర్ రాగలత లు హోంమంత్రి సుచరిత గారిని కలిసి హోమియో మందులను అందించారు. గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి హోమియో మందులను పంపిణీ చేస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.


Popular posts from this blog

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...