Skip to main content

ఎస్ బి ఐ వడ్డీ తక్కువ రుణాలు

*ఎస్‌బీఐ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌..త‌క్కువ వ‌డ్డీకే లోన్స్!*


ప్ర‌స్తుతం ఉన్న క్లిష్ట‌ప‌రిస్థితుల్లో డబ్బు అత్య‌వ‌స‌రంగా మారింది.  దీనికి తోడు రుణాలిచ్చే కొన్నిసంస్థ‌లూ తాత్కాలికంగా రుణాల మంజూరు నిలిపివేశాయి. అందులోనూ క‌రోనా మహ‌మ్మారి తెచ్చిన తిప్ప‌ల‌తో సంస్థ‌లు కూడా ఉద్యోగుల‌ వేత‌నాల్లో కోత‌లు విధిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ బ్యాంకింగ్ దిగ్గ‌జం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊర‌ట‌నిచ్చే వార్త చెప్పింది. త‌మ వినియోగ‌దారుల‌కు స‌త్వ‌రం లోన్ మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పింది. బ్యాంకుల‌కు వెళ్లే ప‌నిలేకుండా ఇంట్లో కూర్చుని లోన్ పొందే స‌దుపాయం ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ అత్య‌వ‌స‌ర లోన్‌లు ప్రీ అప్రూవ్‌డ్ ప‌ర్స‌న‌ల్ లోన్స్ (పీఏపీఎల్‌) లోన్‌లుగా పేర్కొంది.
త‌క్కువ వ‌డ్డీకే అంటే 7.25 శాతం వ‌డ్డీకే కేవ‌లం 45 నిమిషాల్లో లోన్ పొంద‌వ‌చ్చ‌ని తెలుపుతూ ఇటీవ‌లే ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అంతేకాదు లోన్ వాయిదాలు వెంట‌నే ప్రారంభంకావు. ఆరు నెల‌ల త‌ర్వాత నుంచి క‌ట్టాల్సి ఉంటుంది.


ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి...
ఎస్‌బీఐ సీనియ‌ర్  ఉద్యోగి రాజేంద్ర అవ‌స్తి ఈ విష‌య‌మై వివ‌రాలు తెలియ‌జేశారు. ఎస్‌బీఐ వినియోగ‌దారులు త‌మ‌కు లోన్ ఎలిజిబులిటీ ఉందో లేదో తెలుసుకునేందుకు త‌మ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నుంచి 567676 నంబ‌రుకు PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి త‌మ అకౌంట్ నంబ‌రులోని చివ‌రి నాలుగు అంకెల‌ను ఎంట‌ర్ చేసి మెసేజ్ పంపాల్సి ఉంటుంది. త‌రువాత ప్రీ అప్రూవ్డ్ ప‌ర్స‌న‌ల్ లోన్ పొందేందుకు అర్హ‌త ఉందీ లేనిదీ తెలుపుతూ మెసేజ్ వ‌చ్చేస్తుంది. ఆ త‌రువాత ఎస్‌బీఐ యోనో యాప్ డౌన్‌లోడ్ చేసుకుని లోన్ పొంద‌వ‌చ్చు. నిరంత‌రం ఈ స‌దుపాయం అందుబాటులోనే ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.
ఇలా సుల‌భంగా లోన్ పొందండి...
1. స్టేట్ బ్యాంక్ యోనో యాప్ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ అవ్వండి.
2.యాప్ ఓపెన్ చేయండి.
3. కాల వ్య‌వ‌ధి, ఎంత లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారో ఎంచుకొని, వివ‌రాలు న‌మోదు చేయండి.
4. రిజిస్ట‌ర్ మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీ న‌మోదు చేసి, క్లిక్ చేయండి. అంతే న‌గ‌దు మీ ఖాతాలో నిర్ణీత సమ‌యంలో జ‌మ‌వుతుంది.


Popular posts from this blog

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...