Skip to main content

పుస్తక దినోత్సవ శుభాకాంక్షలతో..

*ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు*


*"పుస్తకాల పురుగు" అనే మాటకు డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని చెప్పొచ్చు..అంటే అంత ఎక్కువగా ఇష్టం గా సామాజిక బాధ్యత గా పుస్తకాలు చదివే వారని అర్థం అవుతుంది.అమెరికా ,లండన్ లలో చదువుకునే రోజుల్లో రోజుకి కనీసం 18 గంటల సమయాన్ని అధ్యయనం చేయడానికే అంబేడ్కర్ గారు కేటాయించే వారు.ఆయన కీర్తి నేడు ప్రపంచ వ్యాప్తంగా కొనియాడబడుతుంది.1915లో కొలంబియా విశ్వవిద్యాలయం ఆయనకు పి.హెచ్ డి ఇచ్చింది.*


*అంబేడ్కర్ గారు తన ఇంటికి రాజగృహ అని పేరు పెట్టుకున్నారు. రాజగృహ లో తన ఇంటిలోనే కొన్ని లక్షల పుస్తకాలతో ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.*


*అంబేడ్కర్ గారు మొట్ట మొదటిసారిగా 1916 మే 9 న "భారత దేశంలో కులాలు వాటి పుట్టుక ,పనితీరు,అభివృద్ధి" రచించారు.ఇది కొలంబియా కాలేజీ స్టూడెంట్స్ కోసం వ్ర్రాసింది.కొలంబియా యూనివర్సిటీ ,న్యూయార్క్ ,అమెరికాలో జరిగిన ఆంత్రోపాలజీ సెమినార్ లో చేసిన ప్రసంగ పాఠం ఇది.*


*డా.అంబేడ్కర్ మొత్తం 53 పుస్తకాలు రచించారు.వాటిలో కొన్ని ఇవి*


*భారతదేశం లో రూపాయి సమస్య*


*బుద్ధ అండ్ హిజ్ ధమ్మ* 


*శూద్రులెవరు* 


*హిందూ మతం లో చిక్కుముడులు*


*గాంధీ ,కాంగ్రెస్ అంటరాని వాని వాళ్ళకు చేసింది ఏమిటి ?*


*ఇండియా - పాకిస్తాన్*


*కుల నిర్మూలన* 


*బుద్ధ మరియు కార్ల్ మార్క్స్* 


*భారత రాజ్యాంగం* 


*రనడే మరియు గాంధీ మరియు జిన్నా* 


*వెయిటింగ్ ఫర్ ఎ వీసా* 


*హిందూ కోడ్ బిల్*


*మూక్ నాయక్ ,బహిష్కృత భారత్ ,జనతా ,ప్రబుద్ధ భారత్ వంటి పత్రికలు కూడా అంబేడ్కర్ ఈ దేశ ప్రజల కోసం సమానత్వం కోసం,దేశాన్ని ప్రబుద్ధ భారత్ గా రూపొందించడం కోసం నడిపారు.*


*నాగసేన బోధి*


Popular posts from this blog

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...