Skip to main content

కొత్త ఆలోచనలతో, సరికొత్త కథలతో యువ రచయితలు ముందుకు రావాలి

కొత్త ఆలోచనలతో, సరికొత్త కథలతో యువ రచయితలు ముందుకు రావాలి




- ప్రముఖ సినీ దర్శకులు, రచయిత నల్లపూసలు బాబ్జీ 

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: కొత్త ఆలోచనలతో, సరికొత్త కథలతో యువ రచయితలు ముందుకు రావాలని ప్రముఖ సినీ దర్శకులు, రచయిత నల్లపూసలు బాబ్జీ అన్నారు. సౌత్ ఇండియా లో నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ గా పేరుగాంచిన ఫిఫ్త్ ( ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ ) లో జరిగిన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా నిర్వహించిన స్పెషల్ వర్క్ షాప్ ఆన్ స్క్రిప్ట్ రిజిస్ట్రేషన్ అనే అంశంపై ఆయన మాట్లాడారు. సినిమా కథల రిజిస్ట్రేషన్ విధానం, కాపీ రైట్స్ హక్కుల గురించి వివరించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. సినిమాను సినిమాలా చూడడం కాదని, పుస్తకంలా చదవాలన్నారు. వెండితెరపై తమను తాము ఆవిష్కరించుకునే వరకు అలుపెరుగని పోరాటం చేయాలని , సినీరంగంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని సినీ పరిశ్రమలో పైకి రావాలన్నారు.ఫిఫ్త్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. సంస్థ క్రమశిక్షణ, నిర్వహణా పద్ధతులు, బోధనా విధానం తనకు ఎంతగానో నచ్చిందన్నారు, అందువలనే తన కుమారుడైన అఖిల్ కు  యాక్టింగ్ లో ఇక్కడే  శిక్షణ ఇప్పించానని, ఇప్పుడు తను వెబ్ సిరీస్ లలో, సినిమాలలో నటిస్తున్నాడని బాబ్జీ తెలిపారు. భవిష్యత్తులో మరెందరో ఫిఫ్త్  స్టూడెంట్స్ సినీ పరిశ్రమలో అగ్ర స్థానంలో కనిపించాలని ఆయన ఆశీస్సులు అందజేశారు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సమయంలో ఫిఫ్త్ తీసుకుంటున్న జాగ్రత్తలు, విద్యార్థుల పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తున్న తీరును బాబ్జీ ప్రశంసించారు. ప్రస్తుత సంక్షోభం తొలగిపోయి త్వరలోనే సినీ రంగానికి మంచి రోజులు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఫిఫ్త్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ  ఉదయ్ కిరణ్ కటకం, యాక్టింగ్ ప్రొఫెసర్, పి. ఆర్.ఓ డాక్టర్ శ్రీజ సాదినేని, ఫిల్మ్ మేకింగ్ ఫ్యాకల్టీ మరియు ప్లేస్ మెంట్ సెల్ ఇన్ ఛార్జ్ మయాని తరుణ్ , ఫిఫ్త్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...