Skip to main content

తొలి కౌబాయ్ చిత్రానికి 50 ఏళ్లు

 తొలి కౌబాయ్ చిత్రానికి 50 ఏళ్లు 


'మోసగాళ్లకు మోసగాడు'గా కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో తను ఎదుగుతూ, ఆధునిక సాం కేతిక పరిజ్ఞానం అందించిన హీరో కృష్ణ, ఎన్నో తొలి ప్రయోగాలకు ఆయన నాంది పలికారనే విషయం తెలిసిందే. ఆ విధంగా తొలి కౌబాయ్ చిత్రం కూడా కృష్ణ అందించిందే. ఆంగ్ల చిత్రాలు గుడ్, బాడ్ అగ్లీ, మెకన్నాస్ గోల్డ్, డాకోస్ రివేంజ్ చిత్రా ల స్ఫూర్తితో 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రం రూపొందింది. కేఎస్ఆర్. దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై నేటికి (27 ఆగస్టు 1971) సరిగ్గా యాభై ఏళ్ళు. జానపద, సాంఘిక, పౌరాణిక చిత్రాల నిర్మాణం జరుగుతున్న సమయంలో 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రాన్ని ప్రయోగాత్మకంగా తీశారు. కౌబాయ్ అనేది మన సంస్కతి కాదు. అందుకే ఈ సినిమా ప్రారంభించినపుడు అనేక విమర్శలు వచ్చాయని అంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయని కృష్ణ విమర్శలను లెక్కచేయకుండా సినిమా తీశారు. తన సొంత నిర్మాణ సంస్థ పద్మా లయా స్టూడియోస్ పతాకంపై కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. అలాగే సినిమా కథపై ఉన్న నమ్మకంతో 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రాన్ని రంగుల్లో తీశారు. నిర్మాణపరంగా రాజీ పడలేదని హీరో కృష్ణ, చెప్పారు. రాజస్థాన్ ఎడారిలో షూటింగ్ చేశారు. కృష్ణతో పాటుగా విజయనిర్మల, నాగభూషణం, కైకాల సత్యనారా యణ, జ్యోతిలక్ష్మి తదితరులు నటించారు. అంతర్జాతీయ స్థాయిలో తీసిన సినిమా ఇది. తొలికాపీ వచ్చాక పరిశ్రమ ప్రముఖులు పెదవి విరిచారని కృష్ణ చెప్పేవారు. కౌబాయ్ తెలుగు కథ కాదని, ఆదరణ లభించదనే కామెంట్స్ వినిపించాయి. సినిమా విడుదల య్యాక కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. కౌబాయ్ ను తెలుగువారికి పరిచయం చేసింది. 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రాన్ని ట్రజర్ హంట్ పేరుతో ఆంగ్లలో అనువదించడం విశేషం. అలాగే తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేశారు. చిత్ర విజయంలో సాంకేతిక నిపుణులుగా దర్శకుడు కేయస్ఆర్. దాస్, మేకప్ మెన్ మాధవరావు,ఛాయాగ్రహకుడు విఎస్ఆర్.స్వామి,ఆదినారయణరావు సంగీతం కీలక పాత్ర వహించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...