స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కళాశాలలో క్రానియన్ చర్చ్ ఆధ్వర్యంలో శనివారం సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాతీయ త్రో బాల్ కెప్టెన్ సునీల్, మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వర రావు మాట్లాడుతూ యేసు క్రీస్తు కృప తో గత మూడు రోజులుగా క్రానియన్ చర్చి వారు సువార్త కూడికలు నిర్వహించడం అభినందనీయమన్నారు. . ప్రేమ, కరుణ, అందరికీ పంచాలని ఏసుక్రీస్తు చెప్పినట్టుగా వారి బోధనలు ఆచరించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు గుర్తించి వారికి మంచి మనసుతో నూతన వస్త్రాలు బహిష్కరించడం ఆనందించదగ్గ విషయం మన్నారు.జాతీయ త్రో బాల్ కెప్టెన్ చావలి సునీల్ మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారని, వారిని గౌరవించడం మన బాధ్యతగా భావించాలని తెలిపారు. సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నా పున్నయ్యను ఆయన అభినందించారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అతిథులు గుంటూరు కోటేశ్వరరావు, చావలి సునీల్ అందజేశారు ఈ కార్యక్రమంలోనూ పాస్టర్ లు తంగిరాల యోబు, మంచాల సురేష్, కొప్పుల కాలేబు, గొళ్ళ సతీష్ బాబు, గోళృ ధీరజ్ తదితరులు పాల్గొన్నారు
వరద బాధితులకు విజ్ఞాన్స్ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.