తెనాలి: పట్టణానికి చెందిన దర్శకుడు, పాత్రికేయుడు,వరల్డ్ రికార్డ్ హోల్డర్, సమాచారహక్సంఘం జిల్లా కార్యదర్శి కనపర్తి రత్నాకర్ జన్మదినోత్సవ వేడుకలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ కార్యాలయం లో శుక్రవారం ఘనం గా జరిగాయి. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ తాను జాతీయఉద్యమం నేపథ్యంలో , తెనాలి పరిసర ప్రాంతానికి చెందిన చుక్కపల్లి రామయ్య చరిత్రని వీరస్థలి తెనాలి అనే ఇండిపెండెంట్ చిత్రాన్ని రూపొందించామని చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారన్నారు. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం గా అవార్డ్ లభించిందన్నారు. ఫిబ్రవరి ఆఖరి వారంలో శ్రీ మీడియా బ్యానర్ పై మరో నూతన చిత్రంప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కళ్యాణమస్థు చిత్ర దర్శకుడు ఒసాయి, రామ్ కి, శ్రీ శ్రీ మీడియా నిర్వాహకుడు మునిపల్లి. శ్రీకాంత్, ఆర్ట్ డైరెక్టర్ అపర్ణ చంటి, కొరియోగ్రాఫర్ లు సుధీర్, కిరణ్, పాత్రికేయులు పున్నయ్య, ప్రభాకర్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత రత్నాకర్ ప్రత్యేక కేక్ ను కట్ చేశారు.
విజ్ఞాన్స్ వర్సిటీ సీఈవోగా డాక్టర్ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా డాక్టర్ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వర్సిటీ వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్ డాక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...