Skip to main content

నేడు భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పురస్కార ప్రదానోత్సవ సభ

నేడు భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పురస్కార ప్రదానోత్సవ సభ 


- అంబేద్కర్ జయంతి సందర్భంగా జర్నలిస్ట్ కు అంబేద్కర్ ఎక్స్ లెన్సీ అవార్డుల పేరుతో సత్కారం

 - టాలెంట్ ఎక్స్ ప్రెస్, శ్రీశ్రీ మీడియా , అషేర్ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో 

తెవాలి. భారత రత్న, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని మీడియా సంస్థలు టాలెంట్ ఎక్స్ ప్రెస్, శ్రీశ్రీ మీడియా, స్వచ్ఛంద సేవా సంస్థ ఆషేర్ ఫౌండేషన్ నిర్వహణలో, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం వారం స్థానిక పుట్టి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో ఉత్తమ సేవలందించిన జర్నలిస్ట్ లకు అంబేద్కర్ ఎక్సలెన్సీ పురస్కారాలను ప్రధానం చేయనున్నట్లు నిర్వహకులు కనపర్తి రత్నాకర్ ప్రకటనలో మంగళవారం తెలిపారు. సాంయంత్రం నాలుగు గంటలకు జరగనున్న సభలో ఆతిధులుగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హెనీ క్రిస్టినాసురేష్, స్థానిక శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్, ఐ అండ్ పిఆర్ జాయింట్ డైరెక్టర్ తేళ్ళ కస్తూరి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. అనిత, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్, డాక్టర్ పి.జె రత్నాకర్ , డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు, ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఆకుల అమరయ్య జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత అయినాల మల్లేశ్వరరావులు పాల్గొంటారన్నారు. పత్రికారంగంలో విశేష సేవలందించిన పాత్రికేయులు తేళ్ళ రవీంద్రబాబు ( సూర్యదినపత్రిక ), ఎస్.ఎస్. జహీర్ (జనత దినపత్రిక) గురిందపల్లి ప్రభాకర రావు ( ప్రజాశక్తి దినపత్రిక), వేజండ్ల గోపి రాజారావు ( జి.టివి). మంచికలపూడి రవికుమార్ ( ప్రజాశక్తి దినపత్రిక ) గుమ్మడి ప్రకాశరావు ( దినపత్రిక )లకు పురస్కారాలను అందించనున్నట్లు శ్రీ శ్రీ మీడియా శ్రీకాంత్, ఫెడరేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి శ్యామ్ సాగర్, ఆషేర్ ఫౌండేషన్ నిర్వాహకులు, ఫెడరేషన్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పుట్ల పున్నయ్య లు తెలిపారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...