Skip to main content

బహుముఖ ప్రజ్ఞాశాలి బొల్లిముంత శివరామకృష్ణ

బహుముఖ ప్రజ్ఞాశాలి బొల్లిముంత శివరామకృష్ణ
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, తెనాలి:
ఉపాధ్యాయునిగా, అధ్యాపకునిగా, అరసం నేతగా, కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా, నవలా, కధా, రచయితగా అభ్యదయ సినీ రచయితగా, పత్రికా సంపాదకునిగా, సంగీత దర్శకునిగా, నటునిగా, స్త్రీ పాత్ర ధారిగా బహుముఖ ప్రజ్ఞాశాలి బొల్లిముంత శివరామకృష్ణ అని అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సంపాదకులు గోలి సీతారామయ్య చెప్పారు. తెనాలి గాంధీనగర్ బొల్లిముంత శివరామకృష్ణ పౌండేషన్ హాలులో ఆదివారం బొల్లిముంత ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, ఇస్కఫ్ సంయుక్త ఆధ్వర్యంలో శివరామకృష్ణ 102 జయంతి సభలో ఆయన మాట్లాడారు. సభకు ఉపాధ్యాయ నాయకులు కనవర్తి బెనార్ అధ్యక్షత వహించారు. నీనారామయ్య తన ప్రసంగంలో తెలుగునేతలపై అమూల్యమైన సాహిత్యాన్ని సృష్టించారన్నారు. తెలంగాణా నైజాం, నవాబు పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు సేనానిగా బాగస్వాములై అచట వీడిత ప్రజల కష్టాలను కడగంట్లను అద్భుతంగా చిత్రీకరిస్తూ మృత్యుం జయలు, నవల రాశారన్నారు. అనేక కధలు నవలలు రాస్తూనే ప్రతిభ, ప్రగతి, నగరం ప్రజాపక్షం పత్రికలకు సంపాదకత్వం వహించారన్నారు. చలన చిత్ర రంగంలో యాబై చిత్రాలకు పైగా సంభాషనలు రాసి ప్రసిద్ధి పొందారన్నారు. జీవితాంతం కమ్యూనిస్టుగా జీవించారన్నారు. 1967లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా పార్లమెంటుకు చల్లపల్లి రాజాతో పోటీ చేశారన్నారు. సభా ప్రారంభంగా ప్రజానాట్య మండలి నాయకులు జగన్మోహనరావు, శ్రీదేవి, నీలాంబ్రం, బెజ్జంకి నాగమణి, బాగవతారిణిలు విప్లవ గేయాలను ఆలపించారు. సభలో నగరాజకుమారి, ఎఐటియుసి నాయకులు ఎస్. గురుబ్రహ్మం, మునిపల్లి శ్రీకాంత్, జె.వి. రాంబాబు, ప్రొఫెసర్ శేషిరెడ్డి, వెనిగళ్ళ ప్రసాదు, వెనిగళ్ళ వెంకటేశ్వరరావు, గరికపాటి సుబ్బారావు, పాతూరి సుబ్రహ్మణ్యం, దర్శకుడు కనపర్తి రత్నాకర్, వసంతయామినిలు పాల్గొన్నారు. యం.వి.రఘునాధరావు స్వాగతం పలికారు. చిరంజీవి గగన శ్రీ కూచిపూడి సాంప్రదాయ నృత్యం చేసి అలరించింది.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...