Skip to main content

దశాబ్ది ఉత్సవాలలో సన్మానం పొందిన తొలి మహిళను కావడం అదృష్టం

దశాబ్ది ఉత్సవాలలో సన్మానం పొందిన తొలి మహిళను కావడం అదృష్టం
 - నాటక, టీవీ, సినీ నటి డా.శ్రీజ సాదినేని 

కళారంగంలో కొనసాగడం పూర్వజన్మ సుకృతం అందుకే అంతమంది ప్రముఖుల ఆశీర్వాదం అందుకునే అదృష్టం దక్కింది అన్నారు డా. శ్రీజ సాదినేని.

రవీంద్ర భారతి మెయిన్ హాల్ లో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో ప్రముఖ రంగస్థల,సినీ,టీవీ నటి, రచయిత్రి, దర్శకురాలు  డా.శ్రీజ సాదినేనిని యఫ్ డి సి చైర్మన్ శ్రీ అనిల్ కూర్మాచలం గారు, యం.డి. శ్రీ అశోక్ రెడ్డి గారు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. 
రవీంద్రభారతిలో ఒక్కసారైనా తమ ప్రతిభను ప్రదర్శించాలని ప్రతి కళాకారులూ కోరుకుంటారు. తాను కూడా అలాంటి స్థితిలోనే కళారంగంలో ప్రయాణం ప్రారంభించి ఇదే రవీంద్ర భారతిలో ఎన్నోసార్లు ప్రదర్శనలు ఇవ్వడమే కాక ఎన్నోసార్లు ఇదే వేదికపై అవార్డులు, సన్మానాలు, సత్కారాలతో పాటు తమ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా ఇదే రవీంద్ర భారతిలో అందుకోవడం, అలాగే ఈరోజు ఇంత ఘనమైన సన్మానం అందుకోవడం తన అదృష్టం అని శ్రీజ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

తెలంగాణా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక సన్మాన కార్యక్రమంలో సన్మానం స్వీకరించిన తొలి మహిళ తానే కావడం నటరాజ స్వామి అనుగ్రహం అని, తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన కృషి, కష్టంతో పాటు గురువుల ఆశీస్సులు, మంచి మనసున్న మిత్రుల సహకారం కూడా కారణమని శ్రీజ తెలిపారు.

ఎఫ్.డి.సి. నిర్వహించిన 
నంది నాటకోత్సవాలలో  2003 లో ఇదుగో దేవుడు చేసిన బొమ్మ నాటకంలో అన్వేష పాత్రలో నటిగా మొదలై రచయిత్రిగా, దర్శకురాలిగా, మేకప్ ఆర్టిస్టుగా, నాటక నిర్వాహకురాలుగా నాటక రంగానికి సేవలు అందించిన తాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎఫ్.డి.సి. వారు అందించిన ఈ ఘనమైన గౌరవాన్ని పొందిన ఆనందం మాటల్లో చెప్పలేను అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.ఈ సమయంలో యఫ్.డి.సి.కి శ్రీజ ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు డా శ్రీజ సాదినేనికి అభినందనలు తెలియజేశారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...