పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, దేశ రాజధాని ఢిల్లీలో మీడియాపై దాడి జరగటం హేయమైన చర్యలని ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్షులు మంచికలపూడి రవికుమార్ అన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు ఢిల్లీలో న్యూస్ క్లిక్ ఎడిటర్ అరెస్టు, మరికొంతమంది మీడియా ప్రతినిధులపై అమానుష చర్యలను ఖండిస్తూ తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రువారం సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి బి. వెంకటస్వామి కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ న్యూస్ క్లిక్ ఎడిటర్ ను అమానుషంగా అరెస్టు చేయటం బాధాకరమన్నారు. చట్టపరమైన నిబంధనలు పాటించకుండా మీడియా స్వేచ్చ కు సంకెళ్ళు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ పత్రిక స్వేచ్ఛలో దేశంయొక్క స్తానం 161 కి పడిపోవడం దేశ పత్రికల దుస్థితిని తెలియజేస్తుందని అన్నారు. నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి శ్యామ్ సాగర్ మాట్లాడుతూ ఢిల్లీ లో 30 ప్రాంతాల్లో న్యూస్ పోర్టల్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం దారుణమన్నారు. జర్నలిస్టుల ఇళ్ళపై దాడులు వారికి ఎంతో కీలకంగా ఉన్న ల్యాప్ టాప్స్, మొబైల్ ఫోన్లు పోలీసులు లాక్కోవటాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేసామన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు బచ్చు సురేష్ బాబు, ఎస్ ఎస్ జహీర్, మేకల సుబ్బారావు, పి.పున్నయ్య సభ్యులు బి చంద్రమోహన్, డి నాగరాజు, సిహెచ్ చంద్రశేఖర్, డి వెంకటేశ్వరరావు, కరేటి సాంబశివరావు, డి రవికిరణ్, వి లక్ష్మణరావు, ఎన్ భాస్కర్ తదితరులు పాల్గున్నారు.
విజ్ఞాన్స్ వర్సిటీ సీఈవోగా డాక్టర్ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా డాక్టర్ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వర్సిటీ వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్ డాక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...