చుండూరుడిసెంబర్ 17 మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజేంద్రనాద్ రెడ్డి చేతుల మీదుగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తోపాటుగా చుండూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగావిధులు నిర్వహిస్తున్న313 రాజ్ కుమార్ నేర చేదనలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా బ్రోంజ్ మేడల్ ను శనివారంఅందుకున్నారు రాజ్ కుమార్ తెనాలి పరిసర ప్రాంతాల్లో నేర చరిత్ర కలిగిన వారిపై ప్రత్యేకంగా దృష్టిసరించి వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేసి సఖ స క్యాంగా అనేక నేర పరిశోధనలను చేసి అనేక కేసులను సేధిస్తూ ఉన్నతాధికారులకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ఆయన విదు లు నిర్వహిస్తున్నారు బ్రోంజ్ మెడల్ సాధించిన రాజ్ కుమార్ ను ఉన్నతాధికారులు సిబ్బంది అభినందించారు
విజ్ఞాన్స్ వర్సిటీ సీఈవోగా డాక్టర్ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా డాక్టర్ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వర్సిటీ వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్ డాక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...