Skip to main content

సేంద్రియ ఆహారం దివ్యౌషధం

సేంద్రియ ఆహారం దివ్యౌషధం
సహస్ర క్రాప్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.శ్రీరామ రెడ్డి 
  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా రైతులకు అవగాహన సదస్సు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన పంటలను మానవాళి ఆహారంగా తీసుకుంటే అవి దివ్యౌషధంగా పనిచేస్తాయని సహస్ర క్రాప్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.శ్రీరామ రెడ్డి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో సహస్ర క్రాప్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారి ఆర్థిక సహకారంతో ‘‘ఎంపవరింగ్‌ ఫార్మర్స్‌ ఆన్‌ ఆర్గానిక్‌ ఎన్‌రిచ్‌మెంట్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ హార్టికల్చరల్‌ క్రాప్స్‌ ( ఈఎఫ్‌వోఈఏహెచ్‌సీ)’’ అనేఅంశంపై రైతులకు అవేర్‌నెస్‌ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఆర్గానిక్‌ పంటలపై జరిగిన ఈ అవగాహన కార్యక్రమానికి యూనివర్సిటీ దత్తగ్రామాలైన వేజండ్ల, వడ్లమూడి, సుద్దపల్లి గ్రామాల నుంచి రైతులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాద్‌లోని సహస్ర క్రాప్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.శ్రీరామ రెడ్డి మాట్లాడుతూ రసాయనాలు వినియోగించకుండా పూర్తిగా సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, పండ్లు, తిండి గింజలు, పప్పు ధాన్యాలు సాగుచేయడానికి అదనంగా శ్రమపడాల్సి వస్తుందన్నారు. అయితే ఆ శ్రమ వృథాగా పోదన్నారు. సేంద్రియ ఆహారోత్పత్తులలో స్థూల, సూక్ష్మ పోషకాలతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే ‘‘యాంటీ ఆక్సిడెంట్స్‌’’ వంటి విశిష్ట పోషకాలు అత్యధిక మోతాదులో ఉంటాయన్నారు. రసాయనిక పద్ధతుల్లో పండించే వరి బియ్యం, దొండ, బెండ, కాలీఫ్లవర్‌లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్‌ ఏమీ ఉండవన్నారు. సేంద్రియ ఆహారోత్పత్తుల ద్వారా పండించే వరిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ వేల రెట్లు అధికమని వెల్లడించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...