Skip to main content

మీలో ఒకడిగా వస్తున్నా... మీరే నా భరోసా

మీలో ఒకడిగా వస్తున్నా... మీరే నా భరోసా

  * సినీ యాక్టర్‌ హర్ష చెముడు ( వైవా హర్ష)

  *విజ్ఞాన్‌ మహోత్సవ్‌లో ‘‘ సుందరం మాస్టర్‌’’ యూనిట్‌        సందడి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
విజ్ఞాన్స్‌ విద్యాసంస్థలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన నేను... సినీ హీరోగా మీ ముందుకు మీలో ఒకడిగా వస్తున్నాని, మీరే నా భరోసానని సినీ యాక్టర్‌ హర్ష చెముడు (వైవా హర్ష) అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో జరుగుతున్న జాతీయస్థాయి విజ్ఞాన్స్‌ మహోత్సవ్‌–2కే24లో భాగంగా రెండో రోజు ‘‘ సుందరం మాస్టర్‌ ’’ సినిమా యూనిట్‌ సందడి చేసింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో హర్ష చెముడు, డైరక్టర్‌ కల్యాణ్‌ సంతోష్, మ్యూజిక్‌ డైరక్టర్‌ చరణ్‌ పాకాల, ప్రొడ్యూసర్‌ సుధీర్‌లు విజ్ఞాన్స్‌ మహోత్సవ్‌కు విచ్చేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినిమా హీరో హర్ష చెముడు మాట్లాడుతూ విద్యార్థులు ఏదైనా కొత్తగా ప్రయత్నించాలంటే గ్రాడ్యుయేషన్‌ సమయయే సరైనదన్నారు. తాను ఇంజినీరింగ్‌ చదివేటప్పడు ఏదో ఒకరోజు నేను కూడా ఇలాంటి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రావాలని అనుకున్నాను. 10 సంవత్సరాల తర్వాత నేను మీ ముందుకు అతిథిగా రాగలిగానని వెల్లడించారు. మీ మీద మీకు నమ్మకం ఉండాలని, మీకు ఏది అనిపిస్తే అదే చేయాలన్నారు. ఒకేసారి పెద్ద పెద్ద లక్ష్యాలను ఎంచుకోకుండా....  మొదట చిన్న చిన్న లక్ష్యాలను నిర్ణయించుకుని... తర్వాత తర్వాత పెద్ద లక్ష్యాను నిర్దేశించుకోవాలని విద్యార్థులకు సూచించారు. తన సినీ జీవితంలో ఇంకా సాధించాల్సింది చాలా ఉందని విద్యార్థులకు తెలియజేసారు. విద్యార్థులందరూ సుందరం మాస్టర్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. డైరక్టర్‌  కల్యాణ్‌ సంతోష్‌ మాట్లాడుతూ బ్యాక్‌ బెంచ్‌ విద్యార్థులకు, తోటి స్నేహితులకు సపోర్ట్‌గా నిలిస్తే... వారు ఏదో ఒకరోజు అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. ఈ సినిమా తన మనసుకు బాగా దగ్గరైన సినిమానని తెలియజేసారు ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు. ఈ సినిమాలో తన పాత్ర ఇప్పటివరకు చేసిన పాత్రల కంటే వైవిధ్యభరితమైనదని తెలియజేసారు. అనంతరం సుందరం మాస్టర్‌ సినిమా యూనిట్‌ విద్యార్థులతో సెల్ఫీలు దిగారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...