Skip to main content

ప్రపంచమంతా ఏఐ మయం

ప్రపంచమంతా ఏఐ మయం
- యూఎస్‌ఏలోని అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ మెకానికల్‌ అండ్‌ ఏరో స్పేస్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ పాట్రిక్‌ ఫెలాన్‌
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
భవిష్యత్‌లో ప్రపంచమంతా ఏఐ ( ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌) మయం కానుందని యూఎస్‌ఏలోని అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ మెకానికల్‌ అండ్‌ ఏరో స్పేస్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ పాట్రిక్‌ ఫెలాన్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అడ్వాన్డ్స్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ద ఫ్యూచర్‌ ఆఫ్‌ ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఎట్‌ అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూఎస్‌ఏలోని అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ మెకానికల్‌ అండ్‌ ఏరో స్పేస్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ పాట్రిక్‌ ఫెలాన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ స్కిల్స్‌ ఉంటేనే సంస్థలు అభ్యర్థుల వైపు చూసే పరిస్థితి నెలకొందన్నారు. సమీప భవిష్యత్‌లో ప్రపంచమంతా ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ చుట్టూ తిరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇటీవల కొన్ని కంపెనీలు వారికి అవసరమైన మానవ వనరులను ఎంపిక చేయడంలో సైతం రిక్రూటర్లు ఏఐ టెక్నాలజీను ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. ఏఐ టెక్నాలజీ మార్కెటింగ్‌ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు వినియోగదారుల మనోభావాలను, వారి కొనుగోలు అలవాట్లను ముందే ట్రాక్‌ చేసి సంస్థలకు అందజేస్తుందన్నారు. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే కొత్తగా పలు వినూత్న జాబ్‌ ప్రొఫైల్స్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేరొన్నారు. అనంతరం ముఖ్య అతిథిను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యూఎస్‌ఏలోని అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌ఫర్‌ రిక్రూట్‌మెంట్‌ అసోసియేట్‌ డైరక్టర్‌ చెస్తెర్‌ హెండర్సన్, యూఎస్‌ఏలోని అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ రెప్రెజెంట్‌ రోషన్‌ లాలన్, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...