Skip to main content

గ్రాఫిక్స్ - విజువల్ ఎఫెక్ట్స్ వల్లబడ్జెట్ పెరగదు - తగ్గుతుంది

గ్రాఫిక్స్ - విజువల్ ఎఫెక్ట్స్ వల్ల
బడ్జెట్ పెరగదు - తగ్గుతుంది

"ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్"తో
అద్భుతాలు అలవోకగా ఆవిష్కరించవచ్చు!!
"గీతాంజలి-2"కి గ్రాఫిక్స్ అద్దే
అవకాశం ఇచ్చిన కోన వెంకట్ సార్'కి
ఎప్పటికీ రుణపడి ఉంటాను!!
-గ్రాఫిక్ & విజువల్ ఎఫెక్ట్స్ జీనియస్
*ఉదయ్ తిరుచినాపల్లి*
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అనగానే... అవి పెద్ద సినిమాలకు మాత్రమే అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే" అంటున్నాడు గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ జీనియస్ ఉదయ్ తిరుచినాపల్లి.  అంతేకాదు... గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వల్ల చిన్న సినిమాలు మాత్రమే కాకుండా, పెద్ద సినిమాల బడ్జెట్ ను కూడా గణనీయంగా తగ్గించవచ్చని, ఇక ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్"తో అలవోకగా అద్భుతాలు ఆవిష్కరించవచ్చని ఘంటాపధంగా చెబుతున్నాడు!!

కంప్యూటర్ ఇంజినీరింగ్ లో పట్టభద్రుడైన ఉదయ్ తిరుచినాపల్లి... అమెరికా, ఆస్ట్రేలియాలో మల్టీ నేషనల్ సంస్థల్లో ఉన్నతోద్యోగాలు చేశాడు. అయితే చిన్నప్పటి నుంచి "సినిమా పిచ్చోడైన" ఉదయ్... విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూనే... "అడ్వాన్స్ విజువల్ ఎఫెక్ట్స్"లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. జాబ్ చేస్తూనే, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కి పని చేస్తూ... తన స్కిల్స్'కి పదును పెట్టుకున్న ఉదయ్... కొన్నేళ్ల క్రితం, ఉద్యోగానికి స్వస్తి చెప్పి... సినిమాలకు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అద్దడం ప్రధాన వ్యాపకం చేసుకున్నాడు. పలు ఇంగ్లీష్ సినిమాలకు ఈ విభాగాల్లో పనిచేసి, తన ఉనికిని, ప్రతిభను ఘనంగా ప్రకటించుకున్న ఉదయ్... "హౌ ఈజ్ దట్ ఫర్ ఎ మండే" (HOW IS THAT FOR A MONDAY) అనే ఆంగ్ల చిత్రానికి వి.ఎఫ్.ఎక్స్ సూపర్'వైజర్'గా పని చేశాడు. ఈ చిత్రం "ఈటివి విన్"లోనూ ప్రసారమవుతుండడం విశేషం. అలాగే విమర్శకులు, ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుని "జీ-5"లో ప్రసారమవుతున్న "8 ఎ.ఎమ్.మెట్రో"కు కూడా గ్రాఫిక్స్ అందించాడు. ఈ చిత్రాన్ని "మల్లేశం" ఫేమ్ రాజ్ రాచకొండ రూపొందించి ఉండడం విశేషం. "సాచి" చిత్రానికి కూడా విజువల్ ఎఫెక్ట్స్ సొబగులు అద్దిన ఈ యువ ప్రతిభాశాలి... సెన్సేషనల్  రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ "గీతాంజలి - మళ్లీ వచ్చింది" చిత్రానికి పని చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెబుతాడు. ఈ చిత్రం ఆహా మరియు అమెజాన్ ప్రేక్షకులను అలరిస్తోంది. తన మీద ఎంతో నమ్మకం ఉంచి, తనకు అవకాశం ఇచ్చి, ప్రోత్సహించిన కోన వెంకట్ గారికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని తెలిపాడు.

Popular posts from this blog

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...