Skip to main content

విజ్ఞాన్స్‌ వర్సిటీ వీసీకు ఎన్‌సీసీ విభాగంలో గౌరవ కల్నల్‌ ర్యాంక్‌

విజ్ఞాన్స్‌ వర్సిటీ వీసీకు ఎన్‌సీసీ విభాగంలో గౌరవ కల్నల్‌ ర్యాంక్‌ 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌కు న్యూఢిల్లీలోని గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా – మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ వారు ఎన్‌సీసీ విభాగంలో గౌరవ కల్నల్‌ ర్యాంక్‌ను మంగళవారం అందించింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను, గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఏపీ – తెలంగాణ రాష్ట్రాల ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ డెప్యూటీ డైరెక్టర్‌ జనరల్, ఎయిర్‌ కమోడర్‌ వీ. మధుసూదన్‌ రెడ్డి విజ్ఞాన్‌ యూనివర్సిటీకి విచ్చేసి వెస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌కు అందజేశారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ – తెలంగాణ రాష్ట్రాల ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ డెప్యూటీ డైరెక్టర్‌ జనరల్, ఎయిర్‌ కమోడర్‌ వీ. మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అకడమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌లో ఎన్‌సీసీను ఏకీకృతం చేయడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచి విద్యార్థుల్లో క్రమశిక్షణ, స్నేహభావం, నిబద్ధత, సమగ్ర అభివృద్ధికై చేస్తున్నటువంటి కృషికి గాను ఎన్‌సీసీ విభాగంలో గౌరవ కల్నల్‌ ర్యాంక్‌ను అందించామని వెల్లడించారు. యూనివర్సిటీలో ఎన్‌సీసీ కార్యకలాపాలను ఎక్కువగా నిర్వహించటంలో ఆయన విశేషమైన నిబద్ధతను ప్రదర్శించారని పేర్కొన్నారు. ఎన్‌సీసీ మరియు ఎన్‌సీసీయేతర క్యాడెట్‌లకు 20 క్రెడిట్‌లను అందించే ఎన్‌సీసీ మైనర్‌ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టడం ఆయన సాధించిన విజయాలలో అతి ముఖ్యమైనదన్నారు. ఎన్‌సీసీ ట్రైనింగ్‌ ప్రాముఖ్యతను గుర్తిస్తూ అకడమిక్‌ కరిక్యులమ్‌లో ఇంటిగ్రేటెడ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు ఎస్‌ఎస్‌బీ ట్రై నింగ్‌ను ఎన్‌సీసీ మైనర్‌ కోర్సులో విలీనం చేసారని వెల్లడించారు. ఈయన నాయకత్వంలో కఠినమైన శిక్షణ, క్యాడెట్‌లలో క్రమశిక్షణ, స్నేహ భావాన్ని పెంపొందించడం కోసం విశ్వవిద్యాలయంలో క్యాంపుల నిర్వహణకు అనువైన వాతావరణం ఏర్పాటుకు కృషి చేశారని వెల్లడించారు. గడిచిన విద్యా సంవత్సరంలో ఇక్కడే రెండు శిబిరాలకు క్యాంపు స్థలాన్ని అందించడంలో ఆయన పాత్ర వెలకట్టలేనిదని తెలియజేసారు. రిపబ్లిక్‌ డే క్యాంప్, తలసైనిక్‌ క్యాంప్, ఆర్మీ అటాచ్‌మెంట్‌ క్యాంప్‌తో పాటు ఇతర జాతీయ స్థాయి పోటీలలో విద్యార్థులు చురుకుగా పాల్గొనేలా క్యాడెట్‌లను ప్రేరేపించడంలో వైస్‌ చాన్సలర్‌ కీలకపాత్ర పోషించారని వెల్లడించారు. ఈ క్యాంపుల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగడమే కాకుండా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకి మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఎన్‌సీసీ యూనిట్ల విశిష్టతను గుర్తించి యూనివర్శిటీ పరిధిలో కొత్త యూనిట్లను పెంచేందుకు కృషి చేశారని వెల్లడించారు. ఈ విస్తరణ పరిధిని పెంచడం వలన ఎక్కువ మంది విద్యార్థులు ఎన్‌సీసీలో చేరడానికి అవకాశం లభిస్తుందన్నారు. ఎన్‌సీసీ కోర్సును యాడ్‌–ఆన్‌ డిప్లొమాగా ప్రవేశపెట్టారని తెలియజేసారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ ఎన్‌సీసీ విభాగంలో గౌరవ కల్నల్‌ ర్యాంక్‌ లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ర్యాంక్‌ లభించడం వలన ఎన్‌సీసీ కార్యకలాపాలను నిర్వహించడంలో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఎన్‌సీసీ విద్యార్థులకు ఉపయోగపడేలా సరికొత్త ప్రోగ్రామ్‌లు డిజైన్‌ చేయటంతో పాటు మౌలిక వసతులు మెరుగుపరచడంలో మరింత కృషి చేస్తానన్నారు. గౌరవ కల్నల్‌ ర్యాంక్‌ సాధించిన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌కు కల్నల్‌ సంజయ్‌ గుప్త, గుంటూరు గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ ఎస్‌ఎం. చంద్రశేఖర్, ఇతర గ్రూప్‌ కమాండర్లు, బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్స్, విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...