Skip to main content

కళాకారుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన

కళాకారుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, రోటరీక్లబ్ తెనాలి వైకుంఠపురం, పట్ట రంగస్థల కళాకారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బుర్రిపాలెంరోడ్డులో బి.సి. కాలనీలోని కళాకారుల సంఘం భవనంలో రంగస్థల కళాకారుల కోసం ఉచిత నేత్రవైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాదు చెందిన ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థకు చెందిన అనుబంధ సంస్థ బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం, గూడవల్లిలోని డాక్టర్ కొమ్మారెడ్డి రాజారామ్మోహనరావు నేత్రవైద్య కేంద్రానికి చెందిన సిబ్బంది నేత్ర పరీక్షలు జరిపారు. దాదాపు రెండు వందల మంది కళాకారులు ఈ శిబిరంలో తమ నేత్రాలను పరీక్షించుకున్నారు. ఈ నేపథ్యంలో సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ కళ్ళను పరీక్షించుకున్న అవసరమైన వారికి పది రోజుల్లో కళాకారుల సంఘం తరఫున ఉచితంగా కళ్ళజోళ్ళు అందిస్తాము. శుక్లాలు వచ్చినవారికి ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రివారు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తారని డాక్టర్ సాయిమాధవ్ తెలిపారు. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ఇటువంటి శిబిరాల ద్వారా కళాకారులకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించి సేవా కార్యక్రమాలు జరపతలపెట్టినట్లు పూర్ణచంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆంధ్రప్రదేశ్ కో-ఆర్డినేటర్ వి. వెంకట్, నవీన్, రంజిత్, సుచిత్ర, కళాకారుసంఘ గౌరవ అధ్యక్షుడు ఆరాధ్యుల కోటేశ్వరరావు, అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి, కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి ఆరాధ్యుల ఆదినారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శి మేరిగె రామలింగేశ్వరరావు, కోశాధికారి దీపాల సుబ్రహ్మణ్యం, చెరుకుమల్లి సింగా, షేక్ జానిబాష, దేవరపల్లి భవానీ, కనపర్తి మధుకర్, రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు, గుత్తా వెంకటరత్నం, మురళీకృష్ణ, పావులూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...