Skip to main content

డా. కె.కె.ఆర్. హ్యాపీ వ్యాలీ స్కూల్ ఆధ్వర్యంలో… షార్ట్ ఫిల్మ్ పోటీలు

డా. కె.కె.ఆర్. హ్యాపీ వ్యాలీ స్కూల్ వారి ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ పోటీలు
- విజేతలకు రెండున్నర లక్షల రూపాయల నగదు బహుమతులు

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
యువతలో వున్న సృజనాత్మకతను, సమాజం పట్ల వారికి అవగాహన కలిగించేందుకు ‘డా. కె.కె.ఆర్. హ్యాపీ వ్యాలీ స్కూల్’ మరియు ’64 కళలు.కాం’ – ‘స్పూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్’ వారు నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2025 కు పది నిమిషాల లోపు షార్ట్ ఫిల్మ్ లను రూపొందించి పంపవచ్చు.
________________________________________
బహుమతులు:
1st బెస్ట్ ఫిల్మ్ రూ.: 1,00000/-
2nd బెస్ట్ ఫిల్మ్ రూ.: 50,000/-
3rd బెస్ట్ ఫిల్మ్ రూ.: 30,000/-
వీటితో పాటు మరి కొన్ని నగదు బహుమతులు కూడా.
_________________________________________

క్రింది పది అంశాలలో ఏదో ఒక దానిని కథావస్తువుగా తీసుకోవాలి. (Themes) :
1) సహాయం చేయు.
2) కృతజ్ఞత.
3) పెద్దల పట్ల గౌరవం.
4) మీ జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి?.
5) ప్రకృతితో స్నేహం చేయడం.
6) స్నేహం యొక్క విలువ.
7) ఆడపిల్లను రక్షించండి.
8) దయార్థహృదయం.
9) ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం వల్ల కలిగే నష్టాలు.
10) ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా జీవించాలి.

అర్హతలు:
1) 18 సంవత్సరాలు వయసు దాటిన వారందరూ అర్హులు.
2) క్రింది ఇచ్చిన పది అంశాలలో మాత్రమే షార్ట్ ఫిల్మ్ నిర్మించాలి.
3) షార్ట్ ఫిల్మ్ నిడివి నాలుగు నుండి పది నిమిషాల లోపు వుండాలి.
4) షార్ట్ ఫిల్మ్ తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో మాత్రమే వుండాలి.
5) ప్రవేశ రుసుము రూ. 500/-
6) మీ ఎంట్రీ పంపడానికి చివరి తేదీ: ఏప్రిల్ 2, 2025
7) బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సొంతంగానూ లేదా కాపీ మ్యూజిక్ కూడా వాడుకోవచ్చు.
8) Google Form Link: https://docs.google.com/forms/d/e/1FAIpQLSemKfr1xHrTVSXwXot61xdcn3gq6rNsMv82NBpVhlebKcoeWQ/viewform?usp=header

Popular posts from this blog

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...