వైద్య రంగంలో కొత్త శకానికి నాంది
_ జేఎన్టీయూ కాకినాడ ప్రొఫెసర్ వి.గోపాల కృష్ణ
_ విజ్ఞాన్స్ లారా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ప్రారంభమైన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం
టాలెంట్ ఎక్స్ ప్రెస్:
మెడికల్ రంగంలో ఆధునిక పదార్థాల వాడకం ద్వారా కృత్రిమ అవయవాలు, డెంటల్ ఇంప్లాంట్లు, బోన్ ప్లేట్స్ వంటి వాటిని శరీరానికి అనుకూలంగా తయారు చేయడం ఇప్పుడు సాధ్యమవుతోందని జేఎన్టీయూ కాకినాడ ప్రొఫెసర్ వి.గోపాల కృష్ణ అన్నారు. బయోకంపాటబుల్ పదార్థాలు శరీరంలో తిరస్కరణ లేకుండా పనిచేయడం వల్ల వైద్య రంగంలో ఇది ఒక కొత్త శకానికి నాంది అని పేర్కొన్నారు. చేబ్రోలు మండలం, వడ్లమూడి లోని విజ్ఞాన్స్ లారా ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్టీయూ కాకినాడ వారి సౌజన్యంతో ‘‘అడ్వాన్సెస్ ఇన్ మెటీరియల్స్ అండ్ మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్’’ అనే అంశంపై ఐదు రోజులపాటు నిర్వహించనున్న ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేఎన్టీయూ కాకినాడ ప్రొఫెసర్ వి.గోపాల కృష్ణ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో ఖచ్చితత్వంతో కూడిన వస్తు తయారీ అనేది వైమానిక, ఖగోళ పరిశోధనల్లో ఎంతో అవసరమన్నారు. సాంప్రదాయ తయారితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ మరియు 3డీ ప్రింటింగ్ సహకారంతో మ్యానుఫాక్చరింగ్ను అతివేగంగా మరియు ఖచ్చితత్వంగా చేయవచ్చని పేర్కొన్నారు. ఆటోమొబైల్ రంగమైన వాహనాల తయారీ సంస్థలు ప్రస్తుతం తేలికపాటి కానీ బలమైన పదార్థాలు వంటి పదార్థాలను వాడడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించడమే కాక, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే దిశగా పనిచేస్తున్నాయని తెలియజేసారు. ఏరోస్పేస్ రంగంలో అధిక బలం, తక్కువ బరువు కలిగిన పదార్థాలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని, టిటానియం, కార్బన్ ఫైబర్ వంటి పదార్థాలు విమానాల శరీర భాగాలను నిర్మించడంలో వాడుతున్నారని తెలిపారు. దీనివల్ల విమానాల సమర్థత పెరిగి, ఇంధన వినియోగం తగ్గుతుందన్నారు. అంతేకాకుండా, ఈ పదార్థాలు తక్కువ భద్రతా రిస్కుతో ఎక్కువ మైలేజ్ కలిగిన విమాన ప్రయాణాలను అందుబాటులోకి తెస్తున్నాయన్నారు. నానోపదార్థాల ఆధారంగా తయారవుతున్న నూతన బ్యాటరీలు, ఫ్లెక్సిబుల్ స్క్రీన్లు, స్మార్ట్ సెన్సర్లు తదితరాలు టెక్నాలజీని మరింత వేగవంతం చేస్తున్నాయన్నారు. ఇవి చిన్న పరిమాణంలో ఎక్కువ పనితీరును అందించ గలుగుతున్నాయి వెల్లడించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.ఫణీంద్ర కుమార్ మాట్లాడుతూ 40 మందికి పైగా విద్యావేత్తలు మరియు పరిశోధకులు ఈ ఎఫ్డీపీ కార్యక్రమానికి హాజరయ్యి మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, న్యూరల్ నెట్వర్క్ వంటి ఆధునిక అంశాలు, మెటీరియల్స్ మరియు మాన్యుఫాక్చరింగ్ రంగాలలో ఏవిధంగా ఉపయోగించ వచ్చో తర్ఫీదు తీసుకుంటారని పేర్కొనారు. ఈ యొక్క నైపుణ్యాలను ఉపయోగించి ప్రాజెక్టలు, పరిశోధనలు, చేయవచ్చునని తెలియజేసారు. అంతేకాకుండా వాటి గురించి విద్యార్థులకు వివరించడం ద్వారా వారికికూడాఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ కాకినాడ నుంచి కోఆర్డినేటర్, ఏపీఎంఈ డాక్టర్ ఎం.మధుసూధన ప్రసాద్, విజ్ఞాన్స్ లారా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టక్ కే. ఫణీంద్ర కుమార్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.