Skip to main content

వైద్య రంగంలో కొత్త శకానికి నాంది

వైద్య రంగంలో కొత్త శకానికి నాంది
_ జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్‌ వి.గోపాల కృష్ణ
 _ విజ్ఞాన్స్‌ లారా ఇంజనీరింగ్‌ కళాశాలలో ఘనంగా ప్రారంభమైన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం 
టాలెంట్ ఎక్స్ ప్రెస్:
మెడికల్‌ రంగంలో ఆధునిక పదార్థాల వాడకం ద్వారా కృత్రిమ అవయవాలు, డెంటల్‌ ఇంప్లాంట్లు, బోన్‌ ప్లేట్స్‌ వంటి వాటిని శరీరానికి అనుకూలంగా తయారు చేయడం ఇప్పుడు సాధ్యమవుతోందని జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్‌ వి.గోపాల కృష్ణ అన్నారు. బయోకంపాటబుల్‌ పదార్థాలు శరీరంలో తిరస్కరణ లేకుండా పనిచేయడం వల్ల వైద్య రంగంలో ఇది ఒక కొత్త శకానికి నాంది అని పేర్కొన్నారు. చేబ్రోలు మండలం, వడ్లమూడి లోని విజ్ఞాన్స్‌ లారా ఇంజనీరింగ్‌ కళాశాలలో జేఎన్‌టీయూ కాకినాడ వారి సౌజన్యంతో ‘‘అడ్వాన్సెస్‌ ఇన్‌ మెటీరియల్స్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌ ప్రాసెస్‌’’ అనే అంశంపై ఐదు రోజులపాటు నిర్వహించనున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్‌ వి.గోపాల కృష్ణ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో ఖచ్చితత్వంతో కూడిన వస్తు తయారీ అనేది వైమానిక, ఖగోళ పరిశోధనల్లో ఎంతో అవసరమన్నారు. సాంప్రదాయ తయారితో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్, రోబోటిక్స్‌ మరియు  3డీ ప్రింటింగ్‌ సహకారంతో మ్యానుఫాక్చరింగ్‌ను అతివేగంగా మరియు ఖచ్చితత్వంగా చేయవచ్చని పేర్కొన్నారు. ఆటోమొబైల్‌ రంగమైన వాహనాల తయారీ సంస్థలు ప్రస్తుతం తేలికపాటి కానీ బలమైన పదార్థాలు వంటి పదార్థాలను వాడడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించడమే కాక, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే దిశగా పనిచేస్తున్నాయని తెలియజేసారు. ఏరోస్పేస్‌ రంగంలో అధిక బలం, తక్కువ బరువు కలిగిన పదార్థాలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని, టిటానియం, కార్బన్‌ ఫైబర్‌ వంటి పదార్థాలు విమానాల శరీర భాగాలను నిర్మించడంలో వాడుతున్నారని తెలిపారు. దీనివల్ల విమానాల సమర్థత పెరిగి, ఇంధన వినియోగం తగ్గుతుందన్నారు. అంతేకాకుండా, ఈ పదార్థాలు తక్కువ భద్రతా రిస్కుతో ఎక్కువ మైలేజ్‌ కలిగిన విమాన ప్రయాణాలను అందుబాటులోకి తెస్తున్నాయన్నారు. నానోపదార్థాల ఆధారంగా తయారవుతున్న నూతన బ్యాటరీలు, ఫ్లెక్సిబుల్‌ స్క్రీన్లు, స్మార్ట్‌ సెన్సర్లు తదితరాలు టెక్నాలజీని మరింత వేగవంతం చేస్తున్నాయన్నారు. ఇవి చిన్న పరిమాణంలో ఎక్కువ పనితీరును అందించ గలుగుతున్నాయి వెల్లడించారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్ర కుమార్‌ మాట్లాడుతూ 40 మందికి పైగా విద్యావేత్తలు మరియు పరిశోధకులు ఈ ఎఫ్‌డీపీ కార్యక్రమానికి హాజరయ్యి మెషీన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, న్యూరల్‌ నెట్వర్క్‌ వంటి ఆధునిక అంశాలు, మెటీరియల్స్‌ మరియు మాన్యుఫాక్చరింగ్‌ రంగాలలో ఏవిధంగా ఉపయోగించ వచ్చో తర్ఫీదు తీసుకుంటారని పేర్కొనారు. ఈ యొక్క నైపుణ్యాలను ఉపయోగించి ప్రాజెక్టలు, పరిశోధనలు, చేయవచ్చునని తెలియజేసారు. అంతేకాకుండా వాటి గురించి విద్యార్థులకు వివరించడం ద్వారా వారికికూడాఉపయోగపడుతుందన్నారు.  కార్యక్రమంలో జేఎన్‌టీయూ కాకినాడ నుంచి కోఆర్డినేటర్, ఏపీఎంఈ డాక్టర్‌ ఎం.మధుసూధన ప్రసాద్,  విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టక్‌ కే. ఫణీంద్ర కుమార్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...