విజ్ఞాన్స్ యూనివర్సిటీ విద్యార్థినికి పీహెచ్డీ
చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ మేథమ్యాటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగానికి చెందిన బత్తెన త్రివేణి అనే విద్యార్థినికి బుధవారం విజ్ఞాన్స్ యూనివర్సటీ పీహెచ్డీ పట్టా అందించిందని వైస్ చాన్స్లర్, కల్నల్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ సమ్ ప్రాబ్లమ్స్ ఆన్ కన్వెక్టివ్ బౌండరీ లేయర్ ఫ్లో ఆఫ్ నాన్–న్యుటోనియన్ ఫ్లూయిడ్స్ ఓవర్ ఏ స్ట్రెచ్చింగ్ షీట్’’ అనే అంశంపై విద్యార్థిని పరిశోధన చేసిందని తెలియజేశారు. ఈమెకు విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ మేథమ్యాటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలోని అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మునగాల వెంకట సుబ్బారావు గైడ్గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 3 ఎస్సీఐ పేపర్స్ను పబ్లిష్ చేశారని తెలియజేసారు. డాక్టరేట్ పొందిన బత్తెన త్రివేణిను విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.