ఎంసెట్ ఫలితాల్లో వడ్లమూడి విజ్ఞాన్ విద్యార్థుల ప్రభంజనం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఎంసెట్ ఫలితాల్లో గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ జూనియర్ కాలేజీకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి అందరికంటే ముందు వరుసలో నిలిచారని విజ్ఞాన్ జూనియర్ కళాశాలల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్ జూనియర్ కళాశాలల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ మాట్లాడుతూ వడ్లమూడిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలకు చెందిన ఎం. ఉమేష్ నారాయణన్ (347), ఎస్ డీ అర్షద్ ( 565), వై. విష్ణు కార్తీక్ (613), ఎస్. ప్రేమ్ సాగర్ ( 635), ఎస్ కే ఎమ్రోజ్ (736), వీ. యశ్వంత్ మణికంఠ (883), ఎం. కవిత ( 2735), జీ వీ ఏ. తేజస్వి ( 3008), విద్యా కళ (3415) ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. 1000 లోపు ర్యాంకులు 6 మంది విద్యార్థులు, 5000 లోపు ర్యాంకులు 25 మంది విద్యార్థులు, 10000 లోపు ర్యాంకులు 48 మంది విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. విజ్ఞాన్ జూనియర్ కళాశాల నుంచి ఈఏపీసెట్ కు హాజరైన విద్యార్థులందరూ ర్యాంకులు సాధించారని తెలియజేసారు. ప్రణాళికబద్ధమైన విద్యాబోధన వల్లనే అన్ని పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని వెల్లడించారు. 48 ఏళ్లకుపైగా అనుభవం, అవగాహనతో తాము విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఉత్తమ ర్యాంకులతో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య, విజ్ఞాన్ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, విజ్ఞాన్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు జె.మోహన్రావు, వై.వెంకటేశ్వరరావు, విజ్ఞాన్ జూనియర్ కళాశాలల సిబ్బంది అభినందనలు తెలిపారు.