మీడియా అకాడమీ ఛైర్మన్ సురేశ్ కుమార్ కు అభినందనలు తెలిపిన ఫెడరేషన్ నాయకులు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆలపాటి సురేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యుజేఎఫ్) నాయకులు అభినందనలు తెలియజేశారు. గురువారం ఉదయం 11 గంటలకు విజయవాడ మొగల్రాజపురంలోని మీడియా అకాడమీ కార్యాలయంలో సురేశ్ కుమార్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి జి.ఆంజనేయులు, సీనియర్ జర్నలిస్ట్ కొండబాబు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కలిమిశ్రీ, కార్యదర్శి ఎం.బి.నాథన్ పాల్గొని సురేష్ కుమార్ కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.