Skip to main content

Posts

Showing posts from June, 2025

వైద్య రంగంలో కొత్త శకానికి నాంది

వైద్య రంగంలో కొత్త శకానికి నాంది _ జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్‌ వి.గోపాల కృష్ణ  _ విజ్ఞాన్స్‌ లారా ఇంజనీరింగ్‌ కళాశాలలో ఘనంగా ప్రారంభమైన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం  టాలెంట్ ఎక్స్ ప్రెస్: మెడికల్‌ రంగంలో ఆధునిక పదార్థాల వాడకం ద్వారా కృత్రిమ అవయవాలు, డెంటల్‌ ఇంప్లాంట్లు, బోన్‌ ప్లేట్స్‌ వంటి వాటిని శరీరానికి అనుకూలంగా తయారు చేయడం ఇప్పుడు సాధ్యమవుతోందని జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్‌ వి.గోపాల కృష్ణ అన్నారు. బయోకంపాటబుల్‌ పదార్థాలు శరీరంలో తిరస్కరణ లేకుండా పనిచేయడం వల్ల వైద్య రంగంలో ఇది ఒక కొత్త శకానికి నాంది అని పేర్కొన్నారు. చేబ్రోలు మండలం, వడ్లమూడి లోని విజ్ఞాన్స్‌ లారా ఇంజనీరింగ్‌ కళాశాలలో జేఎన్‌టీయూ కాకినాడ వారి సౌజన్యంతో ‘‘అడ్వాన్సెస్‌ ఇన్‌ మెటీరియల్స్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌ ప్రాసెస్‌’’ అనే అంశంపై ఐదు రోజులపాటు నిర్వహించనున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్‌ వి.గోపాల కృష్ణ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో ఖచ్చితత్వంతో కూడిన వస్తు తయారీ అనేది వైమానిక, ఖగోళ పరిశోధ...

ఎంసెట్‌ ఫలితాల్లో వడ్లమూడి విజ్ఞాన్‌ విద్యార్థుల ప్రభంజనం

ఎంసెట్‌ ఫలితాల్లో వడ్లమూడి విజ్ఞాన్‌ విద్యార్థుల ప్రభంజనం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఎంసెట్‌ ఫలితాల్లో గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ జూనియర్‌ కాలేజీకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి అందరికంటే ముందు వరుసలో నిలిచారని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ మాట్లాడుతూ వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన ఎం. ఉమేష్ నారాయణన్ (347), ఎస్ డీ అర్షద్ ( 565), వై. విష్ణు కార్తీక్ (613), ఎస్. ప్రేమ్ సాగర్ ( 635), ఎస్ కే ఎమ్రోజ్ (736), వీ. యశ్వంత్ మణికంఠ (883), ఎం. కవిత ( 2735), జీ వీ ఏ. తేజస్వి ( 3008), విద్యా కళ (3415) ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. 1000 లోపు ర్యాంకులు 6 మంది విద్యార్థులు, 5000 లోపు ర్యాంకులు 25 మంది విద్యార్థులు, 10000 లోపు ర్యాంకులు 48 మంది విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. విజ్ఞాన్ జూనియర్ కళాశాల నుంచి ఈఏపీసెట్ కు ...

మీడియా అకాడమీ ఛైర్మన్ సురేశ్ కుమార్ కు అభినందనలు తెలిపిన ఫెడరేషన్ నాయకులు

మీడియా అకాడమీ ఛైర్మన్ సురేశ్ కుమార్ కు  అభినందనలు తెలిపిన ఫెడరేషన్ నాయకులు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆలపాటి సురేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యుజేఎఫ్) నాయకులు అభినందనలు తెలియజేశారు. గురువారం ఉదయం 11 గంటలకు విజయవాడ మొగల్రాజపురంలోని మీడియా అకాడమీ కార్యాలయంలో సురేశ్ కుమార్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి జి.ఆంజనేయులు, సీనియర్ జర్నలిస్ట్ కొండబాబు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కలిమిశ్రీ, కార్యదర్శి ఎం.బి.నాథన్ పాల్గొని సురేష్ కుమార్ కు  పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.